'ఆ విషయంలో మీరు నన్ను ప్రశ్నించలేరు'
సాక్షి, ఉత్తరప్రదేశ్ : తన విశ్వాసాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తాను వ్యక్తిగతంగా నమ్ముకున్న విశ్వాసాల ప్రకారం పయనిస్తానని చెప్పారు. అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయోధ్యలో ఉన్న ఆయన సుగ్రీవ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని అన్నారు.
రాజజన్మభూమికి ప్రపంచంలోని ఏ మూలనుంచైనా భక్తులు రావొచ్చని, వారికి భద్రత కల్పించడమే తన బాధ్యత అని అన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రశ్నించగలవని ఆయన అన్నారు. అయోధ్యను పర్యాటక నగరంగా మారుస్తానని చెప్పారు. అయోధ్యతో సహా అన్నిపట్టణాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో తానే స్వయంగా వెళ్లి ప్రచారం చేయబోనని, పార్టీ కోరితే మాత్రం కచ్చితంగా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు