జాతికే గర్వకారణం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జాతికే గర్వకారణమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలు చేసిన త్యాగం ఒక చరిత్ర అని, వారిని తెలుగు జాతి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.
భగవద్గీతలోని కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వైఎస్సార్సీపీ తన కర్తవ్యధర్మాన్ని పాటిస్తోందని, అందులో భాగంగానే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.