కూటమి గెలిస్తే మళ్లీ పరాయిపాలనే
కాంగ్రెస్, టీడీపీపై విరుచుకుపడ్డ ఎంపీ కవిత
సాక్షి, జగిత్యాల: రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే పాలన అమరావతి లేదా ఢిల్లీ నుంచి ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనిం చాలని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నాడు.. నేడు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక్కటేనని, పరాయిపాలనను కోరుకోవద్దని సూచించారు. గురువారం జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఓటుకుకోట్లు కేసులో చంద్రబాబును సూత్రధారిగా రేవంత్రెడ్డిని పాత్రధారిగా అభివర్ణించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి పాత్రధారిని సొంతపార్టీలో.. సూత్రధారిని పక్కనే బెట్టుకుని కూటమి కడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికే కాంగ్రెస్, టీడీపీతో కుమ్మక్కయిందని అనుకో వాలా? అని ప్రశ్నించారు. ప్రతిసారీ ఉద్యమ ఆకాం క్షలు నెరవేరలేదంటున్న టీటీడీపీ అధ్యక్షుడు రమణ, జీవన్రెడ్డి, అసలు రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేసింది టీడీపీ, కాంగ్రెస్ల మీదేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘మీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి. ఉద్యమం పుట్టిందే మీ మీద.. ఒక్క రూపా యి నిధులు ఇవ్వకుండా తెలంగాణను వెనుకబాటు కు గురిచేస్తేనే ఉద్యమం వచ్చింది’ అని అన్నారు.