కాకి.. కాషాయం.. అయోమయం!
కమల్ పై స్టాలిన్ విసుర్లు
చెన్నై : రాజకీయ అరంగేట్రంపై పూటకో ప్రకటన చేస్తోన్న నటుడు కమల్ హాసన్ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని తమిళనాడు ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. పిచ్చివాళ్లు రాజకీయాలకు పనికిరారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
"ప్రజాస్వామ్య దేశంలో 18 ఏళ్లు నిండిన ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ పిచ్చివాళ్లు మాత్రం పనికిరారు. నటుడు కమల్ హాసన్ ఓ సారి కాకి, మరోసారి కాషాయం అంటూ అయోమయంగా మాట్లాడుతారు" అని స్టాలిన్ అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపైనా రాష్ట్రమంత్రులు రోజుకో రీతిగా స్పందిస్తున్నారన్న స్టాలిన్.. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటపడాలంటే గవర్నర్ ఇందులో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.