‘చంద్రబాబూ ముందు రాష్ట్రం సంగతి చూడు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. రాష్టంలో పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు.. ఇతర రాష్ట్రాల పర్యటనను చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన మేరుగ నాగార్జున.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఒక పెయిడ్ మీడియాను అడ్డుపెట్టుని బాబు తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితుల్ని అడ్డుపెట్టుకుని తమ నాయకులపై కేసులో పెట్టిస్తున్న చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు.
‘జగన్పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే ముద్దాయి. అందుకే దళిత నేతలను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేస్తున్నారు. వర్ల రామయ్య, కారం శివాజీ, జూపూడి మీరు తెలుసుకోండి.. మిమ్మల్ని కరివేపాకులా వాడుకుంటున్నారు. వర్ల రామయ్య నువ్వు బలిపశువు అయ్యే రోజు త్వరలోను ఉంది. జగన్పై అవాకులు-చవాకులు మానుకో. చంద్రబాబు నీ పర్యటనలకు, విలాసాలకు ఖర్చపెడుతున్న డబ్బు ఎక్కడిది. చంద్రబాబు నీ బ్రతుకంతా ప్రజలను మోసగించడమే. హత్యారాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు. చంద్రబాబు నీకు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మేరుగ నాగార్జున మండిపడ్డారు.
మరిన్ని వార్తలు