బీజేపీ మాదిరే కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది : మాయావతి​

Mayawati Fires On Congress And BJP - Sakshi

లక్నో : పార్లమెంట్‌ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఝలక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ప్రజలను భయపెట్టే విధంగా పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం​ మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్వహరిస్తుందని ఆమె విమర్శించారు. రెండు రాష్ట్రాలలలోనూ ప్రజలను భయపెట్టే విధంగా పాలన సాగుతుందన్నారు. ఇటీవ‌ల అలీఘ‌డ్ వ‌ర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థుల‌పై యూపీ ప్రభుత్వం దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేసింది. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొంద‌రు ముస్లింల‌పై కమలనాథ్‌ ప్రభుత్వం గోహ‌త్య కేసును న‌మోదు చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ముస్లింల‌పై ఉక్కుపాదం మోపుతున్నాయ‌న్నాయని మాయావతి మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఆమె తెలిపారు. రెండు ప్ర‌భుత్వాల పాలన మ‌ధ్య తేడా లేద‌న్నారు. కాగా యూపీలో కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top