పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని

mallu bhatti vikramarka on modi - Sakshi

మల్లు భట్టి విక్రమార్క

మధిర: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాం గ్రెస్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో తప్పుడు వ్యాఖ్య లు చేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  తలుపులు మూసి కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇచ్చిందని అనడాన్ని బట్టి ఆ పార్టీకి తెలంగాణపై ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోపా టు ఈ చిన్నమ్మను గుర్తుంచుకోవాలని సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రకటన మోదీ మరిచిపోయా రని ఎద్దేవా చేశారు. నాటి సీఎం అంజయ్య ను రాజీవ్‌గాంధీ అవ మానించారంటూ ప్రధాని మోదీ పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నాటి ఘటనపై  సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరు వెంకటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌గాం«ధీ స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. మోదీ  వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌  ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top