'అసత్యాల మీదే టీడీపీ పునాదులు వేసుకుంది'

Malladi Vishnu Comments About - Sakshi

సాక్షి, కృష్ణా : విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కారెంపూడి శివాజీని సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మాణ కార్పొరేషన్ చైర్మన్‌ మల్లాది విష్ణు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా ఛైర్మన్ ,బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ..మార్కెట్ యార్డులో అనేక సంవత్సరాలుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ మార్కెట్‌లకు దశ దిశ నిర్దేశించారని తెలిపారు.అదే విధంగా దేవినేని ఉమామహేశ్వరరావు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యలా మీదే తెలుగు దేశం పునాదులు వేసుకుందని విమర్శించారు. 

'సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు కూడా 150 స్టీట్లు వస్తాయి.25 ఎంపీ సీట్లు కూడా మావే' అంటూ ప్రచారం చేశారని, అధికారం రాకపోవడంతో టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై టీడీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు అవాస్తవాలను తమ మీడియా ద్వారా ప్రచారం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా యాజమాన్యం, పరిశ్రమల సెక్రెటరీ, ప్రభుత్వం చెప్పినా వీరికి బుద్ది రాలేదని, చంద్రబాబు దిగజారిపోయి మీడియా సమావేశం పెట్టి తమిళనాడు నుంచి సమాచారం ఉందని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top