సీఎంపీపై మహాకూటమి భేటీ

Mahakutami meeting over CMP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి నేతలు మంగళవారం మరోమారు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ పార్క్‌ హోటల్‌లో దాదాపు గంటన్నరపాటు సమావేశమైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు మహాకూటమి తరఫున రూపొందిస్తోన్న కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎం పీ)పై చర్చించారు.

ఈ భేటీకి మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీ పీ), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), దిలీప్‌కుమార్‌ (టీజేఎస్‌)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో టీఆర్‌ఎస్‌ నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడం, రాష్ట్రంలో పౌరహక్కులను పునరుద్ధరించడంతోపాటు రైతు సమస్యలను పరిష్కరించే దిశలో ఉమ్మడి ప్రణాళిక ఉండాలని చర్చించారు. బుధవారం మరోమారు సమావేశమై సీఎంపీకి తుదిరూపునివ్వాలని నిర్ణయించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top