తెలంగాణలో కాంగ్రెస్ చచ్చేది ఖాయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
హైదరాబాద్/ కందనూలు (నాగర్కర్నూల్): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నామరూపాల్లేకుండా చేస్తారని, ఆ పార్టీ ఇక తెలంగాణలో చచ్చేది ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్రెడ్డితో కలసి సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 30 వరకు సామాజిక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.