కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలది అసహజ, అపవిత్ర పొత్తు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల పొత్తు అసహజ, అపవిత్రమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. భారతీయ జన తా పార్టీ కార్యాలయంలో ఉప్పల్, జహీరాబాద్, నారాయణ్ఖేడ్లలో వివిధ పార్టీలకు చెందిన నేతలు సోమవారం బీజేపీలో చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన పద్మారెడ్డి తన అనుచరుల తో కలిసి లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లోని నేతలు అసమ్మతితో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరతారని తెలి పారు. 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు తెలం గాణ ప్రజలు రాజకీయంగా ఘోరీ కట్టడం ఖాయమన్నారు. బీజేపీ అంటే టీఆర్ఎస్కు భయమని, ప్రధాని నరేంద్రమోదీ అంటే ఆ పార్టీకి చలి జ్వరం వస్తుందన్నారు. ముందస్తుకు వెళ్లి ప్రజలపై వందల కోట్ల రూపాయల భారం మోపారన్నారు.