టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కులం, మతం ఆధా రంగా జనాన్ని చీల్చి ఓట్లు దండు కోవాల నుకుంటున్న టీఆర్ ఎస్కు బుద్ధి చెప్పా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నా రు. గుజరాత్లో కులం పేరుతో సీట్లు గెలిచేందుకు ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్కు పట్టిన గతి ఇక్కడ టీఆర్ఎస్కు పట్టేలా చేయాలని పిలుపునిచ్చారు.
ఆది వారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐటీ సెల్ సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా వ్యతి రేక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్పై ప్రజ ల్లో వ్యతిరేకత పెరుగుతోందని, మోదీ వైపు ప్రజలు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ గొడుగు నీడలో పనిచేస్తున్నారని విమర్శించారు.