కేటాయింపులు సరే.. ఖర్చులేవి?: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం సారం లేని బడ్జెట్ను పెట్టిం దని, కళ్లెం లేని గుర్రంలా అంకెలు దూసుకుపోతున్నాయి కానీ, ఖర్చులు మాత్రం లేవని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆరో పించారు. శాసనసభలో బడ్జెట్ చర్చపై మాట్లాడారు. గతేడాది సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు కేటా యించి ఈ ఏడాది జనవరి నాటికి రూ.9,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.
ఇందులో దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకు నిధులే ఇవ్వలేదన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం 2.20 లక్షల ఇళ్లు కేటాయించిందని ఈ ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో ఎవరికీ తెలియదని విమర్శించారు. డబుల్ ఇళ్ల పథకానికి రూ.18 వేల కోట్లు కేటాయించి ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆరోపించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని ఆరోపించారు.