రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌..

KTR Speech At Kodangal Road Show  - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి పై గెలవాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. బుధవారం కొడంగల్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు రోడ్డు షోలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి గాలి మాటలు వదిలి అభివృద్ది పనులు చేసి చూపించాలన్నారు.

కాంగ్రెస్‌ దొంగల పార్టీ అని, మహాకూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. అభివృద్ది కావాలంటే కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలో.. ప్రజల మధ్య ఉంటే సీఎం కావాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. కృష్ణా నీళ్లు కొడంగల్‌ రావాలంటే నరేందర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top