టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తాండవం

Krishna District BJP President Chigurupati Kumaraswami Slams TDP In Gannavaram - Sakshi

కృష్ణా జిల్లా: టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తాండవిస్తోందని బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి విమర్శించారు. గన్నవరంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ ఎమ్మెల్యేలు చెరువుల్లోని మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలవరం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం తామే నిర్మించామన్నట్లుగా బస్సులు పెట్టి విద్యార్థులను, ఉపాధ్యాయులను, అధికారులను, టీడీపీ కార్యకర్తలను పోలవరం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రజాధనంతో ఆర్టీసీ బస్సులు పెట్టి పోలవరాన్ని ఎగ్జిబిషన్‌గా చూయించడం వింతగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తిగా బీజేపీ మారుతుందని జోస్యం చెప్పారు. డిసెంబర్‌ 1 నుంచి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలు ప్రతి గడప గడపకూ కార్యకర్తలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top