రాష్ట్రాన్ని గద్దలా దోచుకుంటున్నారు 

Komatireddy comments on kcr - Sakshi

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి  

నల్లగొండ: రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉం టానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రాన్ని గద్దలా దోచుకుంటున్నా రని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల పేరిట 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే, దాంట్లో లక్ష కోట్లు కేసీఆర్‌ కుటుంబమే దోచుకుందని ఆరోపించారు.

పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న చలో అసెంబ్లీకి ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, రైతులతో సోమవారం అసెంబ్లీ ముట్టడి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కోమటిరెడ్డిని పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top