ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్
బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పార్టీ.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, అధికారంలోకి రాగానే కుటుంబ పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు.
గురువారం హైదరాబాద్లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మండల అధ్యక్షులకు ఒక్క రోజు కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహుల పెత్తనమే కొనసాగుతోందన్నారు.