సెంచరీకాదు.. మిగిలే వికెట్లు చూసుకో

Kishan reddy commented over ktr - Sakshi

కాంగ్రెస్‌ మునిగే నావ: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో సెంచరీ దాట డం కాదు, ఎన్నికల వరకు ఎన్ని వికెట్లు మిగులుతాయో కేటీఆర్‌ చూసుకోవాలని బీజేపీ నేత కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీనేతలు బి.కుమార్, ప్రకాశ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుభాష్‌ తదితరులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన తరువాత కేసీఆర్‌ కుటుంబంలోని వికెట్లు పడిపోతాయన్నారు.

వచ్చే ఎన్నికలకోసం కేంద్రం అమలుచేస్తున్న సంక్షే మ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అక్టోబరు మొదటివారంలో అమిత్‌షా రాష్ట్రంలో పర్యటిస్తారని, ఆయన రెండో సభ కరీంనగర్‌లో ఉంటుందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన సంతోష్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారన్నారు.

ఎన్నికల ప్రణాళిక, సభలు, ప్రచారవ్యూహం గురించి వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మహాకూట మి పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మునుగుతున్న నావ అని పేర్కొన్నారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలన్నీ మహాకూటమి పేరుతో పొత్తులు పెట్టుకుంటున్నాయని, ఇదో అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top