ఆదుకోవయ్యా..
తాను ఏడు నెలల క్రితం కిడ్నీకి ఆపరేషన్ చేయించుకున్నానని, పేద కుటుంబానికి చెందిన తమను ఆదుకోవాలయ్యా అంటూ వేములవాడకు చెందిన నున్న విజయలక్ష్మి జగన్కు తన గోడును చెప్పుకొన్నారు. పాదయాత్రలో జగన్ను కలిసి తన ఆరోగ్య పరిస్థితిని వివరించానని, తన కష్టాన్ని ఓపిగ్గా విన్నారని విజయలక్ష్మి అన్నారు.