మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్‌

KCR Announced Two More Candidates For Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్‌ విసిరిన కేసీఆర్‌ తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి కె.మాణిక్‌రావును, మలక్‌పేట్‌ అసెంబ్లీ స్థానానికి చెవ్వా సతీష్‌లను కేసీఆర్‌ అభ్యర్థులుగా ప్రకటించారు.

గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆదివారం సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమంలో జహీరాబాద్‌, మలక్‌పేట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌, మలక్‌పేట్‌లో ఎంఐఎం పార్టీలు గెలుపొందాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top