జనసేన కేసీఆర్‌ భజనసేన: జీవన్‌రెడ్డి

jeevan reddy commented over janasena - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన టీఆర్‌ఎస్‌ భజనసేనగా మారిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడ సంక్షేమం, అభివృద్ధి కనబడుతున్నాయో చెప్పాలని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నచ్చితే జనసేనను అందులో విలీనం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.

తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శిస్తానంటే అనుమతులివ్వని ప్రభుత్వం.. పవన్‌కు ఎందుకిచ్చిందో అందరికీ అర్థమవుతోందన్నారు. అజ్ఞాతవాసి సినిమా 5షోలకు అనుమతినిచ్చి నందుకు కృతజ్ఞతగానే పవన్‌ సీఎం కేసీఆర్‌ భజన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సమస్యలు, నిరుద్యోగుల గోస పవన్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top