కాంగ్రెస్‌ అసమర్థ పార్టీ

A Jeevan reddy commented over congress party - Sakshi

ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అసమర్థ రాజకీయ పార్టీ అని ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బస్సు యాత్ర పేరుతో 40 మంది దొంగలు నోటికొచ్చినట్టుగా మాట్లాడారని, కాంగ్రెస్‌ బస్సు యాత్ర, తుస్సు యాత్ర అని తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ వారపు అంగడి ఉంటే, అక్కడ కాంగ్రెస్‌ బస్సు యాత్రను ప్లాన్‌ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేకే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బస్సు యాత్రలో 40 మంది కాంగ్రెస్‌ నేతలు ఉంటే 33 మంది సీఎం అభ్యర్థులేనని ఎగతాళి చేశారు. రైతులకు పెట్టుబడి సాయం బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికే ఉండదని జోస్యం చెప్పారు. మే 15 తర్వాత గాంధీభవన్‌కు టులెట్‌ బోర్డు తప్పదని, ఇప్పటికే టీడీపీ టులెట్‌ బోర్డు పెట్టుకుని హోల్‌ సేల్‌ అమ్మకానికి బోర్డు తగిలించుకుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top