జనసేనలో భగ్గుమన్న విభేదాలు

janasena Party Candidates Disputes In Payakaraopeta Constituency - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. అయితే విశాఖలోని పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన జనసేన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. జనసేన నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో జనసేన అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. నక్కా రాజబాబు, శివదత్‌లు జనసేన పార్టీ తరుపున పాయకరావుపేట నియోజకవర్గానికి నామినేషన్లు వేశారు. అయితే తనకు ప్రాణహాని ఉందని రాజబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలోని విభేదాలు బట్టబయలయ్యాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top