జనసేన తొలి జాబితా సిద్ధం

Janasena Chief Pawan Kalyan Decided To Release First List Of Candidates - Sakshi

సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను సిద్ధం చేశారు. తొలి జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా డీఎంఆర్‌ శేఖర్‌, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణను ప్రకటించారు. తొలి జాబితాలోని మొత్తం అభ్యర్థులను ఈ రోజు సాయంత్రం లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top