రాహుల్ నాయకత్వంలో కొత్త శిఖరాలకు!
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్త శిఖరాలను అందుకుంటుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్కు అభినందనలు తెలిపారు. రాహుల్ పట్టాభిషేకం సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్సింగ్ ప్రసంగించారు. ‘రాజకీయాల్లో అవాంఛనీయ, కలత కలిగించే ధోరణలు కనిపిస్తున్న తరుణంలో రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతున్నారు. ఓ ప్రముఖ విద్యావేత్త చెప్పినట్టు ఆశావాద రాజకీయాలపై భయకంపిత రాజకీయాలు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో మార్పు తీసుకొచ్చి ఆశావాద రాజకీయాలు నిలబెట్టేందుకు రాహుల్జీ మేం ఆధారపడుతున్నాం’ అని అన్నారు.
‘ఇప్పుడు పార్టీ పగ్గాలను సోనియా రాహుల్కు అందజేశారు. గత 19 ఏళ్లుగా నాయకత్వాన్ని సమైక్యంగా ఉంచుతూ పార్టీ కోసం కృషి చేసిన ఆమెకు సెల్యూట్ చేస్తున్నాను. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ సమధిక అకింతభావంతో, పట్టుదలతో పనిచేస్తారు’ అని మన్మోహన్ అన్నారు.