కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే లేదు
ఆ పార్టీకి ఓటేస్తే మురుగుకాలువలో వేసినట్లే...
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
రామాయంపేట (మెదక్): కాంగ్రెస్పార్టీకి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా అడ్రస్ లేదని, ఆ పార్టీకి ఓటేసినా.. మురుగుకాలువలో వేసినా ఒకటేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఆయన మెదక్ జిల్లా రామాయంపేటలో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. కేంద్రంలో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి ఓటు వేస్తారా అని హరీశ్ ప్రజలను ప్రశ్నించారు.
మెదక్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న గాలి అనిల్కుమార్కు డిపాజిట్ కూడా దక్కదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో మూడోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ను చెల్లని రూపాయిగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గెలుపు విషయంలో అనుమానం లేదని, జిల్లాపేరు ఢిల్లీలో మార్మోగేలా ఐదులక్షలకు పైగా మెజారిటీతో గెలిపించాలని హరీశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.