కోదండరాంతో గూర్ఖాలాండ్‌ ఉద్యమ నేతల భేటీ

Gorkhaland movement  leaders meet with Kodandaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం తో గూర్ఖాలాండ్‌ ఉద్యమ నేతలు సమావేశమయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ కార్యాలయంలో గూర్ఖాలాండ్‌ ఉద్యమ నేత బికాస్‌ రాయ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై వారు చర్చించారు. టీజేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాంను పలు అంశాలపై సూచనలు అడిగారు.

గూర్ఖాలాండ్‌ రాష్ట్రాన్ని సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం లో ఎదురైన అనుభవాలు, వాటిని అధిగమించడానికి అనుసరించిన వ్యూహాల గురించి కోదండరాం వారికి వివరించారు. ఉద్యమానికి మద్దతి వ్వాలని, ఉద్యమ అనుభవాలను వివరించేందు కు రావాలని కోదండరాంను ఆహ్వానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top