అధికారంలోకి రావడానికి ఇదో శుభ సూచికం
హైదరాబాద్ : తెలంగాణలో తాము అధికారంలోకి రావడానికి ఇదో శుభ సూచికమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు రాబోయే ఎన్నికలకు దిక్సూచి అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని, ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పారు. ఇది బీజేపీకి కొత్త మలుపు అని, కాంగ్రెస్ కుయత్నాలు ప్రజలు నమ్మలేదని తెలిపారు.