‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్: జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్పై తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ప్రజల ముద్ర లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. సుమారు రూ. 40 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే కదా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు. అప్పుడే మిగతా రాష్ట్రాలు ప్రగతీపథంలో సాగుతున్న రాష్ట్రాలను చూసి స్ఫూర్తి పొందుతాయని పేర్కొన్నారు.