మూడు రోజుల్లో నిర్ణయం!
రైతుల సమావేశంలో నటుడు కమల్హాసన్
సాక్షి, చెన్నై: అన్నదాత సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా మూడు రోజుల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని నటుడు కమల్హాసన్ తెలిపారు. చెన్నై అడయార్లో శనివారం రైతు సంఘాల సమాఖ్య సమావేశానికి కమల్హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నదాతకు సాయంగా ఉండేందుకు ఇక్కడకు వచ్చినట్టు పేర్కొన్నారు.
‘‘మీలో ఒక్కడిగా వస్తున్నా. ఆదరించండి. నా వెన్నంటి ఐదులక్షల మందితో కూడిన అభిమాన సైన్యం ఉంది. త్వరలో వారు బృందాలుగా మీ వద్దకు రాబోతున్నారు. రుణమాఫీ విషయంలో కేంద్రం నాటకాల్ని ప్రదర్శిస్తోంది. ఇతర రాష్ట్రాల మీద ఓ ప్రేమ, తమిళనాడు మీద మరో రకం.. అన్నట్టుగా సాగుతున్న ఈ తీరును ఎండగట్టేందుకు మూడు రోజుల్లో మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తా’’ అని కమల్ అన్నారు.
ఇలా ఉండగా, కమల్హాసన్కు నటుడు ప్రకాశ్రాజ్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఒక టీవీ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ నటుడు కమల్హాసన్ చేసిన తీవ్రవాదం వ్యాఖ్యలను సమర్థించారు.