కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ కోరాలి: కిషన్‌రెడ్డి

Congress leaders should apologize - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మక్కా మసీదు పేలుళ్ల వెనుక కాషాయ తీవ్రవాదం ఉందంటూ గతంలో కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలు తప్పని కోర్టు తీర్పు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలు లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పేలుళ్లు జరిగిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తదితరులు ఈ పేలుళ్లను రాజకీయాలకు వాడుకున్నారని, దేశ ప్రతిష్ట మంటగలిసేలా కాషాయ తీవ్రవాదమనే కొత్త పేరును తెరపైకి తెచ్చారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీర్పు వెనక మోదీ హస్తముందని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top