కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరు
కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వడంలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేలా చేసినందుకే ప్రజాకోర్టు లో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
కరీంనగర్ బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ యచన్నేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధర్రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం కార్యదర్శి షుశాంక్, వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 30 మంది శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. నాలు గేళ్లుగా తెలంగాణకు అనేక విధాలుగా అన్యాయం చేసిన బీజేపీని సైతం ప్రజలు తిరస్కరిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అమిత్షా పాత చింతకాయ పచ్చడిలాంటి సత్యదూరమైన విమర్శలు చేస్తున్నారన్నారు.
వేములవాడ దేవాల యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. రానున్న నాలుగైదేళ్లలో వేములవాడ పట్టణం పూర్తిగా రూపాంతరం చెంది ఒక అద్భుతమైన టెంపుల్ సిటీగా మారుతుందని మంత్రి చెప్పారు. కొత్తగా పట్టణానికి ఏర్పాటు చేస్తున్న రింగ్రోడ్డు, బస్సు టెర్మినల్, ఇతర టూరిజం అభివృద్ధి ప్రణాళికల ద్వారా పట్టణంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న బుజ్జగింపులు
నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడు తున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేకానంద, మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు కేటీఆర్ తో భేటీ అయ్యారు. మంథనిలో వివేకానంద వర్గం పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోసం పనిచేసేలా చూడాలని మంత్రి కేటీఆర్ సూచిం చారు. మంథనిలో మధు గెలుపు బాధ్య తలను చూసుకోవాలని వివేకానందను కోరారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శనివారం కేటీఆర్ను కలిశారు.