పెట్రోల్ బాటిల్తో చెలరేగిన కాంగ్రెస్ నేత!
సాక్షి, బెంగళూరు : త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కుమారుడు మహమ్మద్ హ్యారీస్ నలపాడ్ పబ్లో ఓ వ్యక్తిపై దాడి చేసి కలకలం రేపగా.. తాజాగా ఓ కాంగ్రెస్ నేత ఏకంగా పెట్రోల్ బాటిల్తో రెచ్చిపోయాడు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెడతానంటూ పెట్రోల్ చల్లి వీరంగం వేశాడు.
కేఆర్ పురం బ్లాక్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణస్వామి ఇటీవల హోరమావులోని బృహత్ బెంగళూరు మహానగర పాలిక వార్డ్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. కేఆర్పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ ప్రధాన అనుచరుడైన నారాయణస్వామి వార్డ్ కార్యాలయంలో పెట్రోల్ చల్లి తగులబెడతానని హెచ్చరించాడు. కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ రెవెన్యూ అధికారి చెంగల్ రాయప్పపై కూడా పెట్రోల్ చల్లాడు. తన అనుచరుడు తీసుకొచ్చిన భూపత్రాలపై సంతకాలు చేయాలంటూ అతను ఈవిధంగా వీరంగం వేశాడు. హోరమావులోని ఎన్నారై లేఔట్ సంబంధించి నారాయణస్వామి భూవివాదంలో ఇరుక్కున్నాడని, ఈ వివాదంలో తమకు అనుకూలంగా సంతకాలు చేయాలంటూ అతను ప్రెటోల్ బాటిల్తో వచ్చి బెదిరించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం విడుదల కావడంతో సదరు కాంగ్రెస్ నేత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.