ప్రగతి భవన్లో ప్రజలకు నో ఎంట్రీ!
తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది
కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి మండిపాటు
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని, ప్రగతి భవన్లోకి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పైరవీకారులకు, క్రాంటాక్టర్లకు, నటులకు మాత్రమే ప్రగతి భవన్లో ప్రవేశముందన్నారు.
ప్రతిపక్షాలు కేసులేసినందుకు అసెంబ్లీ రద్దు చేశాననడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. కేసులేసిన ప్రతిసారి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి.. తెలంగాణలోని నాలుగు కోట్లమంది ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ ఎన్నికలు అని పేర్కొన్నారు. 60 రోజులు మాకివ్వండి.. 60 నెలల భవిష్యత్తు ఇస్తామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.