'సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చారు'

congress leader ponnam prabhakar slams trs

సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ... సిరిసిల్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సిరిసిల్ల టెక్స్ టైల్‌ పార్క్ అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. అలాగే... సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్ కొండను తవ్వి ఎలుకను పట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు.

మన ఊరు-మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడ పోయాయని ఆయన అన్నారు. అంతేగాక రేషన్ షాపుల్లో ఒక్కొక్కటి తగ్గిస్తూ ఇప్పుడు మొత్తం షాపులనే ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రి ప్రమేయం కూడా ఉండడం లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top