అసంతృప్తులతో చర్చలకు బుజ్జగింపుల కమిటీ రాక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం ముగ్గురు సభ్యుల బృందాన్ని హైదరాబాద్కు పంపింది. పార్టీ అధిష్టానం దృష్టిలో ట్రబుల్షూటర్గా పేరుగాంచిన కర్ణాటక సాగునీటి మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కృష్ణారావులు శనివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు.
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వారికి స్వాగతం పలికి పార్క్హయత్కు తీసుకెళ్లారు. అక్కడ కొందరు అసంతృప్తులతో ఈ ముగ్గురు నేతలు భేటీ అయ్యారని సమాచారం. పార్టీ టికెట్ ఇవ్వలేకపోయిన కారణాలను ఆ నేతలకు చెప్పడంతో పాటు వారి భవిష్యత్తుపై నిర్దిష్టమైన హామీలిచ్చి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరినట్టు తెలిసింది.
మరిన్ని వార్తలు