బీజేపీ విజయంపై చంద్రబాబు హర్షం
సాక్షి, అమరావతి: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఎన్నికల విజయ సారథులు ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్షాకు చంద్రబాబు అభినందనలు తెలిపినట్లు పేర్కొంది. అభివృద్ధి కోసం కృషిచేసే పార్టీలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైందని ఆయన అన్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తలు