హోదా రాకపోవడానికి ఆయనే కారణం
తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు ఆరోపించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం బహిరంగ సభలు నిర్వహించడం కాదు..బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మపోరాట సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియోలే కాదు గతంలో ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు మాటలు కూడా ప్రదర్శించాలని అన్నారు.