వీర తిలకం దిద్దండి.. రుణం తీర్చుకుంటా 

Chandrababu in Prakasam district electoral campaign - Sakshi

ప్రకాశం జిల్లా ఎన్నికల సభల్లో చంద్రబాబు వేడుకోలు 

కందుకూరు/చీమకుర్తి/ చీరాల: ‘రాత్రింబవళ్లు పనిచేస్తా. ఇబ్బందులు లేని సుపరిపాలన అందిస్తా. మీకు అండగా నేనుంటా.ఎన్నికల్లో నన్ను ఆదరించండి’అని సీఎం చంద్రబాబు ప్రజలను వేడుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా కందుకూరు, చీమకుర్తి, చీరాలలో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. కందుకూరులో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానా లేదా..? హమీలన్నీ అమలు చేశాను... చెప్పని పథకాలు కూడా అమలు చేశాను’అని అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ నాయకులపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారని సీఎం విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ‘పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులు మీ ఇష్టమొచ్చినట్లు వాడుకోండి. ఎన్నికల్లో మీరు వీరతిలకం దిద్దండి. మీ రుణం తీర్చుకుంటానని’డ్వాక్రా వ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top