కుప్పంలో చంద్రబాబు వెనుకంజ

Chandrababu Kuppam Counting Updates - Sakshi

అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో దూసుకుపోతోంది. ఫ్యాన్‌ ప్రభంజనంలో రాష్ట్రమంతా టీడీపీ కొట్టుకుపోతుండగా.. ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైతం ఫ్యాన్‌ షాక్‌ ఇస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తన కంచుకోట అయిన కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి వెనుకబడ్డారు. మొదటి రెండు రౌండ్లలోనూ ఆయన వెనుకబడటం టీడీపీకి షాకిచ్చింది. రెండురౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి.. చంద్రబాబుపై 357 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top