తెలుగు రాష్ట్రాల టీడీపీ కమిటీలివే

Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ జాతీయ, తెలుగు రాష్ట్ర కమిటీలను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడుగా కళా వెంకటరావు, మరో ఏడుగురు ఉపాధ్యక్షులను నియమించారు. ఈ కమిటీలో 105 మంది ఉన్నారు.

అదేవిధంగా తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు 10 మంది ఉపాధ్యక్షులు, 17 మంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. కొత్తగా పొలిట్‌ బ్యూరోలోకి రేవురి ప్రకాష్ రెడ్డి, సీతక్కను తీసుకున్నారు. తెలంగాణ కమిటీలో 114 సభ్యులున్నారు. త్వరలో అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top