మోదీ పాలనను ప్రజల్లో ఎండగడతాం: చాడ
సాక్షి, హైదరాబాద్: మోదీ నాలుగేళ్ల పాలనను ప్రజల్లో ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. మంగళవారం మఖ్దూం భవన్లో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన, డబుల్ బెడ్ రూమ్లు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, దళితులకు మూడెకరాల భూమి వంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశానికి హాజరైన జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్కుమార్ అంజన్ పలు కార్యవర్గ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.