12 సీట్లు అడిగాం.. 9 అయినా ఓకే: చాడ

chada venkat reddy about seats - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం):  కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్‌ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఐక్యంగా పోటీ చేయా లని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో సీపీఐ తరఫున 12 సీట్లు అడిగామని, ఇందులో 9 ఫైనల్‌ అనుకుంటున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి చెప్పారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీపీఐ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చర్చల అనంతరం 9 సీట్లు ఖరారు అవుతాయని భావిస్తున్నామని అన్నారు. సీపీఎం కూడా మహాకూటమిలో ఉండాలని తాము కోరుకుంటున్నామని, అయితే వారు బీఎల్‌ఎఫ్‌ పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారని అన్నారు. ఈనెల 10న సీపీఎం ప్లీనం ఉందని, అందులో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top