డిసెంబర్ 23 తర్వాత ఏకతాటిపైకి పార్టీలు
కేసీఆర్ను గద్దె దింపేందుకు సమయం ఆసన్నం: చాడ
వికారాబాద్ అర్బన్: డిసెంబర్ 23 తర్వాత రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట బస్సుయాత్ర ఆదివారం వికారాబాద్కి చేరుకుంది. ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల ఫిరాయింపులతో పాలన సాగిస్తున్న కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు అన్ని పార్టీలు విభేదాలు వీడి ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సీపీఐ తరఫున ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.