చంద్రబాబుకు భయం పట్టుకుంది: బొత్స

Botsa Satya Narayana Fires On Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్షనేత, వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. భయంతోనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఎన్‌ఐఏ విచారణ చేయాలని కోర్టే తీర్పు ఇచ్చిందని, ఏపీ పోలీసుల నివేదికలో కూడా వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా ఉందన్నారు. ఈ హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని దుయ్యబట్టారు.

ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్‌ఐఏ విచారణను రీకాల్‌ చెయ్యాలని కోరారు. శ్రీనివాసరావుని వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top