‘బచ్చా చిటికేస్తే ఢిల్లీకి చంద్రబాబు.. సిగ్గులేదా’
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని అందరి నాయకుల కంటే సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ‘బచ్చా’అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. ‘ చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ డైపర్లు వేసుకునే వాడు. అందరి కంటే సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబుకి ‘ బచ్చా’ అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్లటం సిగ్గనిపించటం లేదా? ఇది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా’ అని జీవీఎల్ ట్విటర్లో ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు గారు 1978 లో MLA,1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు. అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే @ncbn కి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా?
ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా? pic.twitter.com/lahgr4HXjJ— GVL Narasimha Rao (@GVLNRAO) November 1, 2018
టీడీపీ అనేక కుంభకోణాలకు పాల్పడిందని జీవీఎల్ ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలు పన్నులు ఎగ్గొట్టారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆరోపించారు. తమ అవినీతి బయటపడకుండా కప్పిపుచ్చేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి అవినీతి కూటమి ఏర్పాటు చేయాలని చూస్తున్నారని జీవీఎల్ విమర్శించారు.
TDP Govt in AP is mired in many scandals (IT, PD accounts, Irrigation scam etc.) MPs are being probed for misappropriation, tax evasion. Reason why Chandrababu Naidu is running from pillar to post to forge a 'Corrupt Alliance' in Delhi. #TDPisDesperatehttps://t.co/OtzBiIz5RK
— GVL Narasimha Rao (@GVLNRAO) November 1, 2018