‘బచ్చా చిటికేస్తే ఢిల్లీకి చంద్రబాబు.. సిగ్గులేదా’

BJP MP GVL Narasimha Rao Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోని అందరి నాయకుల కంటే సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ‘బచ్చా’అఖిలేష్‌ చిటికేస్తే ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటు అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విమర్శించారు. ‘ చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్‌ డైపర్లు వేసుకునే వాడు. అందరి కంటే సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబుకి ‘ బచ్చా’  అఖిలేష్‌ చిటికేస్తే ఢిల్లీకి వెళ్లటం సిగ్గనిపించటం లేదా? ఇది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా’ అని జీవీఎల్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు.
 

టీడీపీ అనేక కుంభకోణాలకు పాల్పడిందని జీవీఎల్‌ ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలు పన్నులు ఎగ్గొట్టారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆరోపించారు. తమ అవినీతి బయటపడకుండా కప్పిపుచ్చేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి అవినీతి కూటమి ఏర్పాటు చేయాలని చూస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top