‘రాహుల్గాంధీ గధోంకా సర్తాజ్’
ఆయన దేశద్రోహిలా వ్యవహరిస్తున్నారు
బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ‘గధోం కా సర్తాజ్’ (గాడిదలకు నాయకుడి)గా మారారని, ఆయన దేశద్రోహిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియా తనయుడు, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా విమర్శించారు.
‘గతంలో రాహుల్గాంధీని పప్పు అని పిలిచేవారు. అది పెద్దగా హాని చేయని, ప్రేమగా పిలుచుకునే పేరు. కానీ, ఇప్పుడు ఆయన దేశద్రోహిలా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయన పేరు పప్పు నుంచి గధోంకా సర్తాజ్గా మారింది’ అని ఆయన మండిపడ్డారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.