ఎన్నికల ముందు జనాలకు తాయిలాలు : కిలారు
సాక్షి, విజయవాడ : బీజేపీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లు.. చంద్రబాబుకు ఓటేస్తే రాహుల్ గాంధీకి ఓటు వేసినట్లే అని బీజేపీ నేత కిలారు దిలీప్ స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు తాయిలాల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నందువల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఓట్ల కోసమే చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు తన పథకాలుగా స్టిక్కర్ వేసుకుంటున్నారని మండిపడ్డారు.