రోజుకు 18 గంటల ప్రచారం!
హరియాణాలోని కర్నాల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రోజుకు 18 నుంచి 20 గంటలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. రోజంతా ప్రయాణంలో, బహిరంగ సభల్లో ప్రసంగించడంలోనే వారి సమయమంతా గడచిపోతోంది. కర్నాల్లో సంజయ్ భాటియా(బీజేపీ), కులదీప్ శర్మ (కాంగ్రెస్), ధరమ్వీర్సింగ్ పాఢా(ఐఎన్ఎల్డీ), కృష్ణా అగ ర్వాల్(ఆప్–జేపీపీ), పంకజ్ చౌధరీ(బీఎస్పీ–ఎలెస్పీ) రంగంలో ఉన్నారు. భాటియా రోజుకు 25 నుంచి 30 సభల్లో ప్రసంగించడానికి 18–20 గంటలు వెచ్చిస్తున్నారు. ‘‘ఉదయం ఐదున్నరకు లేచి గంటలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరతాను. రోజూ 30 గ్రామాల్లో ప్రచారం చేసుకుని రాత్రి పన్నెండున్నరకు ఇంటికి చేరతాను. నా కష్టం ఫలిస్తుంది,’’అని భాటియా మీడియాకు చెప్పారు. ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి కులదీప్ శర్మ కూడా ఉదయం ఏడున్నరకు ఎన్నికల ప్రచారం ప్రారంభించి 25–30 సభల్లో పాల్గొని అర్ధరాత్రి ఇంటికి చేరుతున్నారు. రోజుకు 16–18 గంటలు ప్రచారం చేసినా నియోజకవర్గం మొత్తం తిరగలేకపోతున్నానని ధరమ్వీర్సింగ్ చెప్పారు.