బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ప్రారంభం

BJP Hold Discipline Classes For Lawmakers Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ఢిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభ్యాస్‌ వర్గా పేరుతో రెండు రోజుల పాటు ఎంపీలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీలు పార్ల‌మెంట్ లైబ్ర‌రీ హాల్‌కు చేరుకున్నారు. పార్టీ సిద్ధాంతం, నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం, ప్రజల్లో నడవడిక తదితర అంశాలపై అమిషా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top