బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభ్యాస్ వర్గా పేరుతో రెండు రోజుల పాటు ఎంపీలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లైబ్రరీ హాల్కు చేరుకున్నారు. పార్టీ సిద్ధాంతం, నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం, ప్రజల్లో నడవడిక తదితర అంశాలపై అమిషా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.